‘అందుకే పవన్‌ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు’

AP Home Minister Chinarajappa Fire On Pawan Kalyan In Kakinada - Sakshi

కాకినాడ: జనసేన సభలకు జనం రావడం లేదని, అందుకే పవన్‌ కల్యాణ్‌ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప ఎద్దేవా చేశారు. కాకినాడలో చినరాజప్ప విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కావాలన్న తపనతో పవన్‌ జనంలోకి వెళ్లి చప్పట్లు కొట్టించుకుంటున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. రాజకీయాలలోకి రావాలనుకున్నప్పుడు మంచి విషయాలు చెప్పి రావాలి కానీ ఒకరిని బ్యాడ్‌ చేసి రావడం కరెక్టు కాదన్నారు. లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ పవన్‌ మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలకు సినిమాపై ఆసక్తి ఉన్నట్లే.. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు. లోకేష్‌ను చంద్రబాబు వారసత్వం అని విమర్శిస్తున్న పవన్‌ తన అన్న చిరంజీవి ద్వారా నటుడయ్యాడన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. చిరంజీవి కుమారుడు, తమ్ముళ్లు, తమ్ముళ్ల కుమారులు, మేనళ్లుల్లు నటులు అయిన సంగతి మర్చిపోయినట్లున్నారని గుర్తు చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబుకు, అసలేం అనుభవం లేని పవన్‌ కల్యాణ్‌కు పోలికేంటన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top