‘ఆర్థిక’శిరోభారం తొలగేనా? | Arun jaitley to spoil his way working | Sakshi
Sakshi News home page

‘ఆర్థిక’శిరోభారం తొలగేనా?

Sep 23 2015 1:57 AM | Updated on Aug 15 2018 2:20 PM

‘ఆర్థిక’శిరోభారం తొలగేనా? - Sakshi

‘ఆర్థిక’శిరోభారం తొలగేనా?

ఆర్థికశాఖ మంత్రిగా జైట్లీ పనితీరు ఆయన ప్రతిష్టను తగ్గించివేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, భూ సేకరణ చట్టసవరణ వంటి కీలక సమస్యల పరిష్కారంలో ఆయనది ఘోర వైఫల్యం. బీజేపీ ప్రభుత్వం దీనితో తీవ్రంగా నష్టపోనుంది.

ఆర్థికశాఖ మంత్రిగా జైట్లీ పనితీరు ఆయన ప్రతిష్టను తగ్గించివేస్తోంది. ఏపీకి  ప్రత్యేక హోదా, భూ సేకరణ చట్టసవరణ వంటి కీలక సమస్యల పరిష్కారంలో ఆయనది ఘోర వైఫల్యం. బీజేపీ ప్రభుత్వం దీనితో తీవ్రంగా నష్టపోనుంది.  
 
 నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటినుంచి అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ గురించే మా ట్లాడుతూ వస్తున్నారు. గత ప్ర భుత్వాలు విఫలమైనప్పటికీ తాను ఇండియాను అభివృద్ధి చేయగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2004-14 కాలంలో భారత ఆర్థిక వ్యవ స్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్న దాంట్లో వాస్తవముంది. మన్మోహన్‌సింగ్ గొప్ప ఆర్థికవేత్త అయినప్పటికీ ప్రధానిగా ఆయన ప్రభుత్వ పగ్గాలను సోనియాగాంధీకి అప్పగించేశారు. అంతమ ఫలితం ఏమిటంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఇండియా నిరసించిపోయింది. ఆర్థికాభివృద్ధి స్తంభించిపోయింది. భారీస్థాయిలో నిరుద్యోగితతోపాటు ఆ పదేళ్ల కాలంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చౌక బియ్యం ఇస్తే జనం తమకే ఓటు వేస్తారని సోనియా భ్రమించారు కాని ఇది 1971 కాలం కాదు. ఓటర్లు మారారు. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేశారు.
 
 ఒక దేశ ఆర్థిక సౌభాగ్యం పూర్తిగా ఆర్థిక మంత్రిపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందంటే దానికి ఆర్థిక మంత్రి కారణం. కానీ కేంద్రంలో ఆర్థిక శాఖ తన ముందున్న సవాళ్లను అందుకోలేకపోతోందన్న అభిప్రాయం కొనసాగుతోంది. మోదీ ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి, ఇండియా చమురు ధరల రూపంలో గొప్ప నజరానాను అందుకుంది. అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 నుంచి 50 డాలర్లకు పడి పోయింది. అంటే గత సంవత్సరం చమురు రాయితీపై రూ.2 లక్షలకోట్లను మిగుల్చుకుంది. చమురు దిగుమ తులను భారీగా తగ్గించుకుంది. ద్రవ్యోల్బణం దానికదే సహజంగా తగ్గుముఖం పట్టడంతో దాని నియంత్రణలో ప్రభుత్వం చేసిందేమీ లేదు.
 
 ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో అరుణ్‌జైట్లీ యువరా జులా వెలిగిపోతున్నారు. అధికారికంగా రాజ్‌నాథ్‌సింగ్ నంబర్ టూ స్థానంలో ఉన్నా, ప్రధానమంత్రి మనస్సు ను మార్చగలిగినవారు జైట్లీ మాత్రమే. బీజేపీకి ప్రధాన పార్లమెంటేరియన్ కూడా ఆయనే. సంక్షోభం తలెత్తిన ప్పుడల్లా మీడియా ముందుకొచ్చేదీ జైట్లీయే. ప్రతి పక్షాన్ని ఎదుర్కోవలసివచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాన్ని ఆదుకునేవాడు ఆయనే.
 
 అరుణ్ జైట్లీ అత్యంత ప్రముఖ వ్యక్తి అనడంలో సందేహమే లేదు. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన నేతృత్వం ఆయన ప్రతిష్టను, స్థాయిని తగ్గించివేస్తోంది. స్వయంగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్ 35 ఏళ్ల పాటు ప్రభుత్వంలో పనిచేశారు కనుకే ఆర్థికమంత్రిగా సఫలీకృతుడయ్యారు. జైట్లీ ఎన్నడూ ఉద్యోగం చేయ లేదు. న్యాయవాదిగా ఆయన పని ఏమిటంటే గొప్పగా మాట్లాడటం. ఇండియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం అనేది కోర్టులలో కేసులను గెలవడం లాంటిది కాదు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరిం చినప్పుడు ఒక లాయర్‌గా ఆర్థిక వ్యవస్థకు చెందిన ముఖ్యాంశాలను గ్రహిస్తానని జైట్లీ మీడియాకు తెలి పారు. కానీ గత 15 నెలల కాలంలో జైట్లీకి మన ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే కనబడుతోంది.
 ఆర్థికమంత్రిగా జైట్లీ పరిష్కరించలేకపోయిన ప్రధా న సమస్యలు ఏవంటే... 1. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక హోదా సమస్యను జైట్లీ పరిష్కరించలేకపోయా రు. ఇది చాలా తీవ్ర సమస్య. బీహార్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ వాగ్దానం చేసింది కానీ విఫలమైంది. 2. జీఎస్‌టీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేదు.జీఎస్‌టీకి మద్ద తివ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆర్థికమంత్రి నింది స్తున్నారు. అయితే ప్రతిపక్షానికి నచ్చచెప్పాల్సిన బాధ్య త ఆర్థికమంత్రిదే. పార్లమెంటు విశ్వాసం పొందలేకపో యినందుకు జైట్లీనే నిందించాల్సి ఉంటుంది. 3. దేశం లో రోజుకు సగటున 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
 
 సోనియా గాంధీ పదేళ్లపాటు రైతుల ఆత్మహత్యలపై నోరు మెదపని తీరులోనే జైట్లీ కూడా వ్యవహరిస్తున్నారు. రైతుల సమస్యకు ఆర్థిక మంత్రి పరిష్కారం కనుగొనకపోతే బీజేపీ తీవ్రనష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. 4.సేవా పన్నును తగ్గించడానికి బదులుగా జైట్లీ దాన్ని 12 నుంచి 14 శాతానికి పెంచారు. దీంతో కొనుగోలుశక్తి పడిపోయి పేద, మధ్యతరగతి వర్గాలు దెబ్బతింటాయి. 5. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా వినియోగదారీ ద్రవ్యోల్బణం కొండెక్కి కూచుం ది. ఆహార ధరలు చుక్కలంటుతున్నా ప్రభుత్వం స్పం దించలేదు. మోదీ ప్రజాదరణకు ఇది విఘాతం కలిగి స్తుంది. 6. అరుణ్ జైట్లీ 2013 భూసేకరణ చట్ట సవరణ ప్రతిపాదకుడు. ఈ చట్టాన్ని సవరించకుంటే పెట్టుబ డులు రావని చెప్పి ప్రధానినే బుట్టలో వేశారు.
 
బీజేపీ ప్రభుత్వాన్ని ఇది తీవ్రంగా నష్టపరించింది. దేశానికి మంచి విధానాలను ఆర్థిక మంత్రి అందివ్వకపోతే నరేం ద్రమోదీ ప్రభుత్వం విఫలమైనట్లే. చమురు ధరలు బా గా తగ్గుముఖం పట్టడంవల్లే మోదీ ప్రభుత్వానికి కాస్త మంచి పేరు మిగిలింది. అరుణ్ జైట్లీని ఎవరూ బహిరం గంగా విమర్శించలేరు. మోదీని వైఫల్యం వైపు తీసుకు పోతున్నది జైట్లీయేనని తన వెనుక గుసగుసలాడుకుం టున్నారు. కానీ ప్రధాని పూర్తిగా జైట్లీపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థికరంగంలో జైట్లీ విఫలమైతే 2019లో మోదీకి పరాజయం తప్పదు. జైట్లీని ఆర్థిక శాఖనుంచి మార్చలేరు. బీజేపీలో అంతప్రతిభ కలవారు లేరు. మోదీ బయటనుంచి ప్రతిభావం తులను తీసుకోలేరు. చమురు ధరలు తక్కువగా ఉన్నంతవరకూ ఇండి యానే కాక జైట్లీ వంటి వారు కూడా మనగలరు. మొత్తంమీద చూస్తే జైట్లీ గొప్ప హోంమంత్రిగానో మరో మంత్రి గానో ఉండగలరు కానీ ఆర్థిక మంత్రిగా ఆయనపై పలు సందేహాలున్నాయి.
 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
 e-mail:Drpullarao1948@gmail.com
 - పెంటపాటి పుల్లారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement