land acquisition law
-
మల్లన్నసాగర్పై రైతుల పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతుల వేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రైతులు అడిగిన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవో నెంబర్ 123 అనేది ఒక ప్రక్రియ మాత్రమేనని.. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోతే భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాగా, మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీవో 123 కింద భూ సేకరణ నిలిపేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లా తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
‘ఆర్థిక’శిరోభారం తొలగేనా?
ఆర్థికశాఖ మంత్రిగా జైట్లీ పనితీరు ఆయన ప్రతిష్టను తగ్గించివేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, భూ సేకరణ చట్టసవరణ వంటి కీలక సమస్యల పరిష్కారంలో ఆయనది ఘోర వైఫల్యం. బీజేపీ ప్రభుత్వం దీనితో తీవ్రంగా నష్టపోనుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటినుంచి అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ గురించే మా ట్లాడుతూ వస్తున్నారు. గత ప్ర భుత్వాలు విఫలమైనప్పటికీ తాను ఇండియాను అభివృద్ధి చేయగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2004-14 కాలంలో భారత ఆర్థిక వ్యవ స్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్న దాంట్లో వాస్తవముంది. మన్మోహన్సింగ్ గొప్ప ఆర్థికవేత్త అయినప్పటికీ ప్రధానిగా ఆయన ప్రభుత్వ పగ్గాలను సోనియాగాంధీకి అప్పగించేశారు. అంతమ ఫలితం ఏమిటంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఇండియా నిరసించిపోయింది. ఆర్థికాభివృద్ధి స్తంభించిపోయింది. భారీస్థాయిలో నిరుద్యోగితతోపాటు ఆ పదేళ్ల కాలంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చౌక బియ్యం ఇస్తే జనం తమకే ఓటు వేస్తారని సోనియా భ్రమించారు కాని ఇది 1971 కాలం కాదు. ఓటర్లు మారారు. కాంగ్రెస్ను తుడిచిపెట్టేశారు. ఒక దేశ ఆర్థిక సౌభాగ్యం పూర్తిగా ఆర్థిక మంత్రిపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందంటే దానికి ఆర్థిక మంత్రి కారణం. కానీ కేంద్రంలో ఆర్థిక శాఖ తన ముందున్న సవాళ్లను అందుకోలేకపోతోందన్న అభిప్రాయం కొనసాగుతోంది. మోదీ ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి, ఇండియా చమురు ధరల రూపంలో గొప్ప నజరానాను అందుకుంది. అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్కు 110 నుంచి 50 డాలర్లకు పడి పోయింది. అంటే గత సంవత్సరం చమురు రాయితీపై రూ.2 లక్షలకోట్లను మిగుల్చుకుంది. చమురు దిగుమ తులను భారీగా తగ్గించుకుంది. ద్రవ్యోల్బణం దానికదే సహజంగా తగ్గుముఖం పట్టడంతో దాని నియంత్రణలో ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో అరుణ్జైట్లీ యువరా జులా వెలిగిపోతున్నారు. అధికారికంగా రాజ్నాథ్సింగ్ నంబర్ టూ స్థానంలో ఉన్నా, ప్రధానమంత్రి మనస్సు ను మార్చగలిగినవారు జైట్లీ మాత్రమే. బీజేపీకి ప్రధాన పార్లమెంటేరియన్ కూడా ఆయనే. సంక్షోభం తలెత్తిన ప్పుడల్లా మీడియా ముందుకొచ్చేదీ జైట్లీయే. ప్రతి పక్షాన్ని ఎదుర్కోవలసివచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాన్ని ఆదుకునేవాడు ఆయనే. అరుణ్ జైట్లీ అత్యంత ప్రముఖ వ్యక్తి అనడంలో సందేహమే లేదు. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన నేతృత్వం ఆయన ప్రతిష్టను, స్థాయిని తగ్గించివేస్తోంది. స్వయంగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ 35 ఏళ్ల పాటు ప్రభుత్వంలో పనిచేశారు కనుకే ఆర్థికమంత్రిగా సఫలీకృతుడయ్యారు. జైట్లీ ఎన్నడూ ఉద్యోగం చేయ లేదు. న్యాయవాదిగా ఆయన పని ఏమిటంటే గొప్పగా మాట్లాడటం. ఇండియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం అనేది కోర్టులలో కేసులను గెలవడం లాంటిది కాదు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరిం చినప్పుడు ఒక లాయర్గా ఆర్థిక వ్యవస్థకు చెందిన ముఖ్యాంశాలను గ్రహిస్తానని జైట్లీ మీడియాకు తెలి పారు. కానీ గత 15 నెలల కాలంలో జైట్లీకి మన ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే కనబడుతోంది. ఆర్థికమంత్రిగా జైట్లీ పరిష్కరించలేకపోయిన ప్రధా న సమస్యలు ఏవంటే... 1. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా సమస్యను జైట్లీ పరిష్కరించలేకపోయా రు. ఇది చాలా తీవ్ర సమస్య. బీహార్కు ప్రత్యేక హోదాపై బీజేపీ వాగ్దానం చేసింది కానీ విఫలమైంది. 2. జీఎస్టీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేదు.జీఎస్టీకి మద్ద తివ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆర్థికమంత్రి నింది స్తున్నారు. అయితే ప్రతిపక్షానికి నచ్చచెప్పాల్సిన బాధ్య త ఆర్థికమంత్రిదే. పార్లమెంటు విశ్వాసం పొందలేకపో యినందుకు జైట్లీనే నిందించాల్సి ఉంటుంది. 3. దేశం లో రోజుకు సగటున 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సోనియా గాంధీ పదేళ్లపాటు రైతుల ఆత్మహత్యలపై నోరు మెదపని తీరులోనే జైట్లీ కూడా వ్యవహరిస్తున్నారు. రైతుల సమస్యకు ఆర్థిక మంత్రి పరిష్కారం కనుగొనకపోతే బీజేపీ తీవ్రనష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. 4.సేవా పన్నును తగ్గించడానికి బదులుగా జైట్లీ దాన్ని 12 నుంచి 14 శాతానికి పెంచారు. దీంతో కొనుగోలుశక్తి పడిపోయి పేద, మధ్యతరగతి వర్గాలు దెబ్బతింటాయి. 5. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా వినియోగదారీ ద్రవ్యోల్బణం కొండెక్కి కూచుం ది. ఆహార ధరలు చుక్కలంటుతున్నా ప్రభుత్వం స్పం దించలేదు. మోదీ ప్రజాదరణకు ఇది విఘాతం కలిగి స్తుంది. 6. అరుణ్ జైట్లీ 2013 భూసేకరణ చట్ట సవరణ ప్రతిపాదకుడు. ఈ చట్టాన్ని సవరించకుంటే పెట్టుబ డులు రావని చెప్పి ప్రధానినే బుట్టలో వేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇది తీవ్రంగా నష్టపరించింది. దేశానికి మంచి విధానాలను ఆర్థిక మంత్రి అందివ్వకపోతే నరేం ద్రమోదీ ప్రభుత్వం విఫలమైనట్లే. చమురు ధరలు బా గా తగ్గుముఖం పట్టడంవల్లే మోదీ ప్రభుత్వానికి కాస్త మంచి పేరు మిగిలింది. అరుణ్ జైట్లీని ఎవరూ బహిరం గంగా విమర్శించలేరు. మోదీని వైఫల్యం వైపు తీసుకు పోతున్నది జైట్లీయేనని తన వెనుక గుసగుసలాడుకుం టున్నారు. కానీ ప్రధాని పూర్తిగా జైట్లీపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థికరంగంలో జైట్లీ విఫలమైతే 2019లో మోదీకి పరాజయం తప్పదు. జైట్లీని ఆర్థిక శాఖనుంచి మార్చలేరు. బీజేపీలో అంతప్రతిభ కలవారు లేరు. మోదీ బయటనుంచి ప్రతిభావం తులను తీసుకోలేరు. చమురు ధరలు తక్కువగా ఉన్నంతవరకూ ఇండి యానే కాక జైట్లీ వంటి వారు కూడా మనగలరు. మొత్తంమీద చూస్తే జైట్లీ గొప్ప హోంమంత్రిగానో మరో మంత్రి గానో ఉండగలరు కానీ ఆర్థిక మంత్రిగా ఆయనపై పలు సందేహాలున్నాయి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) e-mail:Drpullarao1948@gmail.com - పెంటపాటి పుల్లారావు -
రెట్టింపు ఇస్తేనే మా భూములిస్తాం
నర్సాపూర్రూరల్ (మెదక్): తాము పోగొట్టుకునే భూమికి రెట్టింపు భూమి ఇస్తేనే భూ సేకరణకు అంగీకరిస్తామని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసిత రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 18డీ ఈఈ దయానంద్, మధుకాన్ సంస్థ ప్రతినిధి సాంబశివరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి నుంచి వెల్దుర్తి మండల కేంద్రం పక్క నుంచి మహ్మదాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల మేర కాలువకు కాలువ నిర్మాణ ప్రతిపాదనలు పూర్తి కాగా భూములను సేకరించాల్సి ఉందని తెలిపారు. అయితే, ఎకరంలోపు ఉన్న చిన్న రైతులే ఆ గ్రామాల్లో ఉన్నారని గ్రామస్తులు విన్నవించారు. ఆ భూములు కూడా పోతే తామంతా రోడ్డున పడుతామని చెప్పారు. అందుకే ప్రభుత్వం పది గుంటలు ఉన్న వారికి 20 గుంటలు, ఎకరా ఉన్న వారికి రెండెకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి కాలువను తవ్వుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారు. -
బలవంతపు భూసేకరణకు మేం వ్యతిరేకం
భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్సార్సీపీ లోక్సభలో మరోసారి స్పష్టం చేసింది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై మంగళవారం చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి పాల్గొన్నారు. ‘వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తోంది. బహుళ పంటలు సాగయ్యే భూములు, సారవంతమైన భూములను రైతుల ఆమోదం లేకుండా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏపీలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు లాక్కోవడం సరికాదు. అక్కడికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధానిని నిర్మించవచ్చు. రైతులు మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ కారణాల వల్లే మేం ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నాం. ఈసారి కూడా సవరణలు సూచిస్తాం. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..’ అని మేకపాటి స్పష్టం చేశారు. -
'ఆయన తెలంగాణలో పర్యటించి ఏం చేస్తారు'
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి ఏం చేస్తారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయిందని విమర్శించారు. భూ సేకరణ చట్టాన్ని రాజకీయం చేయెద్దని దత్తాత్రేయ సూచించారు. కార్మిక శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి' అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. -
కేసీఆర్ విచక్షణకే వదిలేస్తున్నాం: చాడా
- మే 14న భూ సేకరణకు నిరసనగా జైల్ భరో కార్యక్రమం - తెలంగాణలో జలవిధానంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి హైదరాబాద్: సీపిఐ తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని సీపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం సామాన్య ప్రజలకు, రైతులకు వ్యతిరేకమని ఆయన అన్నారు. చాడా వెంకటరెడ్డి గురువారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ భూ సేకరణకు నిరసనగా మే 14న జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చాడా వెల్లడించారు. తెలంగాణలో జలవిధానంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైతు ప్రయోజనాలకే పెద్దపీట
* ప్రభుత్వ ప్రాథమ్యం అదే * భూసేకరణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికే సవరణలు * పార్లమెంటు ఉభయసభల సంయుక్త భేటీలో రాష్ట్రపతి స్పష్టీకరణ * సభ సజావుగా సాగేందుకు సహకరించండి; ఎంపీలకు ప్రణబ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లుపై పార్లమెంటు వేదికగా పోరుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్న నేపథ్యంలో.. భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులు, వారి కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ తొలి ప్రాథమ్యమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్న వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్లో మార్పు చేర్పులేమైనా ఉంటాయా అన్న విషయం మాత్రం ఆయన ప్రస్తావించలేదు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాళ్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. పార్లమెంటు సజావు నిర్వహణకు సహకరించాల్సిందిగా ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. పరస్పర సమన్వయంతో ప్రగతిదాయక చట్టాల రూపకల్పనకు కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత ఈ 9 నెలల్లో సాధించిన విజయాలను, ప్రారంభించిన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, జనధన్ యోజన, దేశ, విదేశాల్లో నల్లధనం వెలికితీత కోసం తీసుకున్న చర్యలు.. తదితర కార్యక్రమాలను ప్రణబ్ ప్రస్తావించారు. చివరగా ‘ఒకే ఇండియా.. శ్రేష్టమైన ఇండియా(ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్).. జైహింద్’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ.. తదితరులు ముందువరుసలో కూర్చొని రాష్ట్రపతి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. - రైతుల శ్రేయస్సుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. భూసేకరణ విధానంలో పారదర్శకత పాటిస్తూ నష్టపోతున్న రైతులకు న్యాయమైన పరిహార హక్కు లభించేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కీలక ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామీణ గృహనిర్మాణం, మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం తదితర మౌలిక వసతుల కోసం జరిపే భూసేకరణలో పాలనాపరమైన ఇబ్బందులను సాధ్యమైనంతగా తగ్గించే లక్ష్యంతో భూ సేకరణ, పునరావాస చట్టంలో సవరణలు చేసి మెరుగుపర్చారు. - ఆహార భద్రతకు రైతే కీలకం. మార్కెట్ సంస్కరణలు, సాగులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం రైతుల శ్రేయస్సుకు ఉపయోగపడ్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ను కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. గ్రామాల్లో సాగునీటి సదుపాయాల కోసం ఈ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన’ను ప్రారంభించింది. - ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశ రక్షణకు సవాలుగా మారాయి. రాష్ట్రాల సహకారంతో వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. - ‘అందరినీ కలుపుకుని.. అందరి అభివృద్ధి’ అనేది ఈ ప్రభుత్వ నినాదం. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. - దేశ విదేశాల్లోని నల్లధనం వెలికితీతకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆ దిశగా.. చట్టపరమైన, శాసన సంబంధమైన చర్యలతో పాటు పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. - పొరుగు దేశాలు ముఖ్యంగా దక్షిణాసియా దేశాలతో సత్సంబంధాల విషయంలో ముందడుగు వేశాం. మన ప్రజలు, మన సరిహద్దులను రక్షించుకోగలమనే విషయాన్ని వారికి స్పష్టం చేశాం. - అమెరికా, రష్యా, చైనా దేశాధ్యక్షుల భారత పర్యటనలు ఆయా దేశాలతో మన సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చాయి. - ప్రజాస్వామ్యమనే దేవాలయానికి పార్లమెంటు పరమపవిత్రమైన గర్భగుడి వంటిది. పార్లమెంటు తమ ఆశలు, ఆకాంక్షలు తీర్చగలదని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు, దృఢమైన ఆధునిక భారతదేశ నిర్మాణం దిశగా ఎంపీలంతా సహకారం, సమన్వయంతో సాగాలి. - భారీ ఆర్థిక వ్యవస్థల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. తాజా అంచనాల ప్రకారం 2014-15లో ఇండియా 7.4 వృద్ధి రేటు సాధించగలదు. ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. - న్యాయ సంస్కరణలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఆ దిశగా తీసుకు వచ్చిందే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్’. అలాగే, కాలం చెల్లిన చట్టాలను గుర్తించేందుకు నియమించిన కమిటీ అలాంటి 1741 చట్టాలను గుర్తించింది. - పన్ను వ్యవస్థలోనూ సమూల మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేసేందుకు వస్తు, సేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా జనధన యోజనను ప్రారంభించాం. ఈ పథకం కింద ఇప్పటివరకు 13.2 కోట్ల బ్యాంక్ ఖాతాలు, 11 వేల కోట్ల డిపాజిట్లు, 11.5 కోట్ల రూపే కార్డుల జారీతో.. ఈ పథకం విజయవంతమైంది. - అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటూనే.. నిజాయితీపరులైన అధికారులను కాపాడేందుకు చర్యలు చేపట్టాం. - 15 కోట్లమంది సబ్సీడీ ఎల్పీజీ వినియోగదారుల్లో దాదాపు 75% మందికి సబ్సీడీ మొత్తాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి. - రానున్న ఏడేళ్లలో మొత్తం విద్యుదుత్పత్తిలో ప్రత్యామ్నాయ విద్యుత్తు వాటా 15 శాతానికి చేరేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చప్పగా సాగింది: విపక్షం న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగం కొత్తదనమేం లేకుండా చప్పగా సాగిందని విపక్షాలు విమర్శించాయి. యూపీఏ పథకాలనే కొత్త పేరుతో ఏకరువు పెట్టారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇన్నాళ్లూ చేసిన ప్రకటనల పునరుక్తే రాష్ట్రపతి ప్రసంగమని, పైగా, అది చాలాసేపు కొనసాగడంతో సభ్యులకు నిద్రొచ్చేసిందని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ పనితీరు ‘పని తక్కువ.. మాటలెక్కువ’గా ఉందన్న విషయం రాష్ట్రపతి ప్రసంగంతో స్పష్టమైందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. -
‘భూసేకరణ’ ఆర్డినెన్స్ రైతు వ్యతిరేకం
మోదీ సర్కార్పై విపక్షాల ధ్వజం ఐక్య పోరాటానికి కాంగ్రెస్ పిలుపు మేం అమలు చేయం: మమత సర్కారు చర్యను తప్పుబట్టిన మిత్రపక్షం పీఎంకే న్యూఢిల్లీ: అభివృద్ధి ప్రాజెక్టులకు రైతుల ఆమోదం లేకుండానే వారి భూములను స్వాధీనం చేసుకునేలా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎన్డీఏ మిత్రపక్షమైన పీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పార్లమెంటు ముగిశాక దొడ్డి దారిన ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకురావడాన్ని కూడా తప్పుబట్టాయి. ప్రభుత్వ చర్యను రైతు వ్యతిరేకిగా, అన్యాయమైనదిగా, ఆందోళన కలిగించేదిగా అభివర్ణించాయి. భూసేకరణకు రైతుల అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ప్రభుత్వం చట్ట సవరణలో తొలగించడం బలవంతపు భూసేకరణకు తలుపులు తెరిచేలా ఉందని, ఇది ఆందోళనకరమని భూసేకరణ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఈ సవరణను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రైతుల భూములను బదలాయించే, అవసరానికి మించి భూసేకరణ చేపట్టే ప్రమాదం కూడా ఉందన్నారు. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరాల్సిందేనన్నారు. భూసేకరణ చట్టాన్ని సవరించడం ద్వారా బీజేపీ రైతు వ్యతిరేకి అనిపించుకుందని మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ విమర్శించారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించేందుకు రైతు అనుకూల పార్టీలన్నీ ముందుకు రావాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించిన బీజేపీ...ఇప్పుడు కార్పొరేట్ల కోసం భూసేకరణ చేసే ఉద్దేశంతోనే చట్ట సవరణ చేసిందని ఎండీఎంకే నేత వైకో ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్...చట్ట సవరణలో మార్పులు కోట్లాది మంది రైతులపై ప్రభావం చూపుతాయని విమర్శించారు. ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలపరాదని కోరారు. ఎమర్జెన్సీకన్నా దారుణం: మమత కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ అమలును తమ రాష్ట్రంలో చేపట్టబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం ఒకవేళ అమలు చేయాలనుకుంటే తన శవాన్ని దాటాకే ఆ పని చేయాల్సి ఉంటుందన్నారు. మోదీ పాలన దేశంలో ఎమర్జెన్సీ రోజులకన్నా దారుణంగా ఉందని కోల్కతాలో జరిగిన సభలో దుయ్యబట్టారు. పార్లమెంటులో అడ్డుకుంటాం: ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ చట్టాన్ని సవరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురావడాన్ని పార్లమెంటులో అడ్డుకుంటామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఏచూరి మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ఐదేళ్లలో 25 ఆర్డినెన్సులు తీసుకురాగా ఎన్డీఏ ప్రభుత్వం ఆరునెలల్లోనే 9 ఆర్డినెన్సులు తెచ్చిందని విమర్శించారు. గత్యంతరం లేకే ఆర్డినెన్స్: వెంకయ్య పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటం వల్ల ప్రభుత్వానికి వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే భూసేకరణ చట్ట సవరణకు ఆర్డినెన్స్ను జారీ చేయాల్సి వచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణల విధానాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.