'ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి' | why narendra modi silence on lalit modi issue?, asks mallikarjuna kharge | Sakshi
Sakshi News home page

'ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి'

Jun 27 2015 12:18 PM | Updated on Oct 8 2018 9:17 PM

'ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి' - Sakshi

'ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి'

:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతల పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

హైదరాబాద్:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతల పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. లలిత్ మోదీ విదేశాలకు వెళ్లడానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలు సహకరించారని ఆరోపణలు చుట్టుముట్టినా ప్రధాని నోరు ఎందుక మెదపడం లేదన్నారు.

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన హెచ్చరించారు. ఏడాది పాలనలోనే బీజేపీ నేతలు చాలా అవినీతికి పాల్పడ్డారని ఖర్గే ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement