మదురై మహిళకు పాదాభివందనం

Vajpayee touched Tamil Nadu woman's feet - Sakshi

మదురై జిల్లా పుల్లచ్చేరి గ్రామానికి చెందిన చిన్నపిళ్‌లై అనే మహిళకు 2001లో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా పాదాభివందనం చేశారు. కళంజియం అనే పేరుతో చిన్నపిళ్లై ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజల్లో పొదుపు చేసే అలవాటును బాగా ప్రోత్సహించారు. ఆమె సమాజ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘శ్రీ స్త్రీశక్తి’పురస్కారాన్ని అందజేసింది. నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి చిన్నపిళ్లైకి అవార్డు బహూకరిస్తూ ఆమె పాదాలకు నమస్కారం చేశారు. దీంతో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. వాజ్‌పేయి కన్నుమూశారన్న వార్త విని చిన్నపిళ్లై కన్నీరు పెట్టుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top