ఢిల్లీ, జమ్మూకశ్మీర్లో భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉత్తర భారతంపైనా ప్రభావం చూపించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. ఆ రాష్ట్రాల ప్రజలు భీతిల్లారు. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్లోని హిందుకుష్ పర్వతశ్రేణిలో ఉంది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావం ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలపై పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్లో కొద్దిసేపు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.