మంచు కారణంగా రైళ్లు 6 గంటలు ఆలస్యం | Trains from north running late by over 6 hrs due to heavy fog | Sakshi
Sakshi News home page

మంచు కారణంగా రైళ్లు 6 గంటలు ఆలస్యం

Dec 21 2014 5:59 PM | Updated on Sep 2 2017 6:32 PM

పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

విజయవాడ: పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యూఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం లింక్, న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్ప్రెస్ తదితర రైళ్లు ఆరుగంటలకు పైగా ఆలస్యంగా వచ్చాయి. ఉత్తరాది నుంచి వస్తున్న రైళ్లు ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెప్పారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ఇతర రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement