పడవ మునక.. పర్యాటకుల మృతి! | tourists dead after a boat carrying 20 capsized in sea | Sakshi
Sakshi News home page

పడవ మునక.. పర్యాటకుల మృతి!

Feb 27 2017 4:57 AM | Updated on Sep 5 2017 4:41 AM

పడవ మునక.. పర్యాటకుల మృతి!

పడవ మునక.. పర్యాటకుల మృతి!

పడవ మునిగిపోయిన ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతిచెందారు.

చెన్నై: పడవ మునిగిపోయిన ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతిచెందగా, మరో 11 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. ఈ ఘటన తమిళనాడులోని ట్యూటికోరిన్ సమీపంలో మనప్పాడ్ లో చోటుచేసుకుంది. బోటులో దాదాపు 20 మంది పర్యాటకులు ఆదివారం షికారుకు వెళ్లగా అలల తాకిడి ఎక్కువై సముంద్రంలో పడవ మునిగిపోయింది. దీంతో పడవలోని అందరూ గల్లంతయ్యారని అధికారులు భావించగా, ఆపై 11 మందిని రక్షించినట్లు తెలిపారు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement