ఆయుధాల చోరీ చేసి ఉగ్రవాదుల పరారీ | Suspected Terrorists Flee After Snatching 4 Rifles From Policemen In Kashmir | Sakshi
Sakshi News home page

ఆయుధాల చోరీ చేసి ఉగ్రవాదుల పరారీ

May 8 2016 2:32 PM | Updated on Sep 3 2017 11:41 PM

జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆయుధాలతో సహా పరారైన ఘటన కుల్గామ్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆయుధాలతో సహా పరారైన ఘటన కుల్గామ్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అధికారుల సమాచారం మేరకు... గుర్తుతెలియని కొందరు ఉగ్రవాదులు కుల్గామ్ జిల్లా అడిజన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో చొరబడ్డారు. పోలీసుల వద్ద ఉన్న 4 రైఫిళ్లను చోరీ చేసినట్లు తెలిపారు. రెండు ఎస్ఎల్ఆర్ లు, రెండు ఇన్ సాస్ రైఫిల్స్ ఉన్నట్లు వివరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement