ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట

Published Thu, Jan 8 2015 11:53 AM

ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట - Sakshi

న్యూడిల్లీ: ఇందుటెక్ కేసులో  ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందూటెక్ వ్యవహ్యారంలో రత్నప్రభపై సీబీఐ 9వ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఆమెపై అభియోగాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించింది.  సీబీఐ మోపిన అభియోగాలను గతంలో హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement