ముందు పళని బలం తేలాల్సిందే! | Stalin Urges Governor to Ask Palaniswami to Prove Majority | Sakshi
Sakshi News home page

ముందు పళని బలం తేలాల్సిందే!

Aug 25 2017 7:14 PM | Updated on Aug 21 2018 11:58 AM

ముందు పళని బలం తేలాల్సిందే! - Sakshi

ముందు పళని బలం తేలాల్సిందే!

19 మంది సొంత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే పళనిస్వామి ప్రభుత్వం మైనార్టీలో...

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ సీ విద్యాసాగర్‌ రావును ప్రతిపక్ష నేత స్టాలిన్‌ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ ను కలిసిన డీఎంకే అధినేత తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచాలని విజ్నప్తి చేశారు. 
 
ప్రస్తుతం ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిపిన స్టాలిన్‌ పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డారంటూ 19మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా పళని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని వివరించారు. 
 
గతంలో సభలో బలనిరూపణ సందర్భంగా వ్యతిరేకంగా ఓటేసిన పన్నీర్‌ సెల్వం అండ్ గ్రూప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్‌ ధన్‌పాల్‌ ఇప్పుడు పార్టీ విప్‌ ఆదేశాలతో దినకరన్‌ వర్గానికి నోటీసులు పంపటం ఆశ్చర్యంగా ఉందని స‍్టాలిన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement