సోనియాకు, అమిత్‌షాకు సీఐసీ నోటీసులు | Sonia, Amit Shah cic notice | Sakshi
Sakshi News home page

సోనియాకు, అమిత్‌షాకు సీఐసీ నోటీసులు

Sep 15 2014 1:24 AM | Updated on Mar 29 2019 9:24 PM

సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయనందుకు కేంద్రసమాచార కమిషన్ (సీఐసీ) పార్టీలపై చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా,

న్యూఢిల్లీ: సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయనందుకు కేంద్రసమాచార కమిషన్ (సీఐసీ) పార్టీలపై చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ సోనియాతో పాటు ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు చేపట్టరాదో తెలియజేయాలంది. గతేడాది సుభాష్ అగర్వాల్ అనే కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ మేరకు సీఐసీ ఈ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చింది.

అయినా ఆ పార్టీలు కమిషన్ ఆదేశాలను పాటించలేదు. దీనిపై లోగడ రెండు సార్లు సీఐసీ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2013, జూన్3న తామిచ్చిన ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు ప్రారంభించరాదో నాలుగు వారాల్లో తెలియజేయాల సీఐసీ తాజా నోటీసులిచ్చింది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement