ఆమోదయోగ్యం కాదు: శివసేన | Shiv Sena Boycotts NDA Meeting on Land Acquisition Bill: 10 Developments | Sakshi
Sakshi News home page

ఆమోదయోగ్యం కాదు: శివసేన

Feb 25 2015 3:13 AM | Updated on Sep 2 2017 9:51 PM

భూసేకరణ బిల్లుకు తెచ్చిన సవరణలకు ప్రస్తుత రూపంలో తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షమైన

న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు తెచ్చిన సవరణలకు ప్రస్తుత రూపంలో తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేన మంగళవారం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఏ చట్టాన్నీ శివసేన సమర్థించబోదని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో రైతులు బీజేపీకి ఓటేసి అధికారంలోకి తెచ్చారని, వారి గొంతునులిమే పాపానికి ఒడిగట్టవద్దని ఉద్ధవ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

రాజ్యసభలో శివసేనపక్ష నేత సంజయ్ రౌత్ ఈ ప్రకటనను విడుదల చేశారు. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి శివసేన వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాగేసుకొని అభివృద్ధి సాధించాలనుకోవడం సరికాదని థాకరే అభిప్రాయపడ్డారు. ఎన్‌డీఏలో బీజేపీ తర్వాత రెండో పెద్ద పార్టీ శివసేనయే. ఈ పార్టీకి లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీల మద్దతుంది. ఉభయసభల సంయుక్త సమావేశంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి శివసేన వైఖరి శరాఘాతమే. ఎందుకంటే శివసేన మద్దతు లేకపోతే సంయుక్త సమావేశంలో కూడా మెజారిటీ సాధించడం కేంద్రానికి కష్టమే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement