ఎయిమ్స్‌ వైద్యుడి మృతిపై ఢిల్లీ సీఎం దిగ్ర్భాంతి | Senior AIIMS Doctor Jitendra Nath Pande Deceased Due To COVID-19 | Sakshi
Sakshi News home page

మహమ్మారితో ఎయిమ్స్‌ వైద్యుడి మృతి

May 24 2020 4:55 PM | Updated on May 24 2020 5:17 PM

Senior AIIMS Doctor Jitendra Nath Pande Deceased Due To COVID-19 - Sakshi

కరోనా మహమ్మారి బారినపడి ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యుడి మరణం

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ జితేంద్ర నాథ్‌ పాండే (78) మరణించారు.  ఎయిమ్స్‌ పల్మనాలజీ విభాగానికి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ పాండేతో పాటు ఆయన భార్యకు మంగళవారం నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

తాము తరచూ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నామని, తన పరిస్థితి మెరుగైందని చెప్పారని, శనివారం డిన్నర్‌ ముగించుకుని పడుకున్న తర్వాత నిద్రలో తుదిశ్వాస విడిచారని గులేరియా చెప్పారు. తీవ్ర గుండెపోటుతో డాక్టర్‌ పాండే మరణించి ఉంటారని వెల్లడించారు. కాగా పాండే మరణం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అపోలో గ్రూప్‌ జేఎండీ డాక్టర్‌ సంగీతా రెడ్డి సహా పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి : ఆర్‌ఎంఎల్‌ డీన్‌కు కరోనా పాజిటివ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement