శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ | Saradha scam: CBI grills Trinamool MP Suvendu Adhikari | Sakshi
Sakshi News home page

శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ

Sep 24 2014 4:12 PM | Updated on Sep 2 2017 1:54 PM

శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ

శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ

పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది.

కోల్కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సువేందు అధాకారిని ప్రశ్నించారు.

సీబీఐ అధికారులు దాదాపు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. 'సాక్షిగా నన్ను విచారించారు. నాకు తెలిసిన విషయాలను వారికి చెప్పా' అని అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో పలువురు ఎంపీలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటీవల ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement