
గ్రానైట్ పరిశ్రమ జీఎస్టీ స్లాబ్పై పునరాలోచించండి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్నుల స్లాబ్లో చేర్చడంపై
స్లాబ్ల తగ్గింపునకు తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు సుధాకర్రెడ్డిని, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గసభ్యుడు నారాయణను బుధవారం ఢిల్లీలో కలుసుకొని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సురవరం కేంద్రమంత్రికి లేఖ రాశారు. సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను 5 శాతం స్లాబ్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్పై జూన్ 2న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సురవరం, నారాయణను కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.శంకర్, కోశాధికారి పి.యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.