-
28% శ్లాబులో ఇక 35 మాత్రమే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో అత్యధిక పన్ను రేటైన 28 శాతం శ్లాబులో ఇక 35 వస్తువులే మిగిలాయి. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 28 శాతం శ్లాబులో మొత్తం 226 వస్తువులు ఉండేవి. అయితే గత ఏడాది కాలంలో ఈ శ్లాబులోని 191 వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను తగ్గించింది. వాటిలో కొన్నింటిపై పన్ను పూర్తిగా ఎత్తివేయగా, మరి కొన్నింటిని 5, 12, 18 శాతం శ్లాబుల్లో చేర్చింది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఎయిర్ కండీషనర్లు, వంటపాత్రలు కడిగే యంత్రాలు, 27 అంగుళాల కంటే పెద్దవైన టీవీలు, తదితర విలాసవంతమైన వస్తువులతోపాటు సిగరెట్లు, గుట్కా వంటి ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 27న కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చి, స్థిరమైన ఆదాయం రావడం మొదలైన అనంతరం.. 28 శాతం శ్లాబు నుంచి మరికొన్ని వస్తువులను కూడా ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, ఆరోగ్య హానికారక ఉత్పత్తులపైన మాత్రమే అత్యధిక పన్నును వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చంటున్నారు.పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, ఏసీలు తదితరాలను కూడా ప్రభుత్వం 18 శాతం పన్ను శ్లాబులోనే చేర్చొచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి పేర్కొన్నారు. ఆరోగ్యానికి చేటు చేసే ఉత్పత్తులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. భవిష్యత్తులో అత్యంత విలాస వస్తువులు, ఆరోగ్యం పాడు చేసే ఉత్పత్తులపైనే 28 శాతం పన్ను ఉండేలా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి అభిషేక్ జైన్ అంటున్నారు. 27 నుంచి 28 శాతం శ్లాబులో మిగిలేవి ఏసీలు, 27 అంగుళాల కన్నా పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్లు, సిమెంటు, మోటార్ వాహనాలు, వాహనాల విడిభాగాలు, టైర్లు, స్టీమర్లు, విమానాలు, శీతల పానీయాలు, బెట్టింగ్, పొగాకు, సిగరెట్, పాన్ మసాలా, గుట్కాలు తదితరాలు. భవిష్యత్తులో మూడు శ్లాబ్లే: సుశీల్ మోదీ జీఎస్టీలో పన్ను రేట్ల శ్లాబ్లను భవిష్యత్తులో మూడుకు తగ్గించే అవకాశం ఉండొచ్చని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ వెల్లడించారు. జీఎస్టీపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘానికి సుశీల్ నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. ‘ప్రస్తుతం జీఎస్టీలో 0, 5, 12, 18, 28 శాతం పన్నులు.. మొత్తం 5 శ్లాబులు ఉన్నాయి. వీటిని మూడుకు తగ్గించే ఆలోచన ఉంది. అయితే, ఇది రాష్ట్రాల ఆదాయానికి సంబంధించింది కాబట్టి సమయం పడుతుందని సుశీల్ చెప్పారు. -
గ్రానైట్ పరిశ్రమ జీఎస్టీ స్లాబ్పై పునరాలోచించండి
కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీని కోరిన సురవరం సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్నుల స్లాబ్లో చేర్చడంపై పునరాలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి కోరారు. అన్ని రకాల గ్రానైట్ పరిశ్రమలను 28 శాతం పన్ను పరిధిలో చేర్చడం వల్ల 32 శాతం పన్ను పరిధిలో ఉన్న పెద్ద తరహా పరిశ్రమలు నాలుగు శాతం పన్ను తగ్గి 28 శాతం స్లాబ్లోకి వస్తాయన్నారు. ప్రస్తుతం రెండు శాతం సీఎస్టీ, రాష్ట్రంలో 14.5 శాతం వ్యాట్ చెల్లిస్తున్న చిన్న తరహా గ్రానైట్ వ్యాపారులు కూడా 28 శాతం స్లాబ్లోకి వస్తారని, దీని వల్ల చిన్న తరహా పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని బుధవారం అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. స్లాబ్ల తగ్గింపునకు తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు సుధాకర్రెడ్డిని, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గసభ్యుడు నారాయణను బుధవారం ఢిల్లీలో కలుసుకొని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సురవరం కేంద్రమంత్రికి లేఖ రాశారు. సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను 5 శాతం స్లాబ్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్పై జూన్ 2న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సురవరం, నారాయణను కలిసినవారిలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.శంకర్, కోశాధికారి పి.యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement