సీజేఐగా రంజన్‌ గొగోయ్‌ | Ranjan Gogoi appointed next Chief Justice of India | Sakshi
Sakshi News home page

సీజేఐగా రంజన్‌ గొగోయ్‌

Sep 15 2018 4:18 AM | Updated on Sep 15 2018 4:18 AM

Ranjan Gogoi appointed next Chief Justice of India - Sakshi

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌(63) నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన మొట్టమొదటి సీజేఐ ఈయనే కావడం గమనార్హం.  ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ గొగోయ్‌ పేరును సీజేఐగా లా కమిషన్‌కు ప్రతిపాదించారు. కమిషన్‌ ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీకి పంపగా ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేయడంతో న్యాయమంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ అంశాలకు సంబంధించి సీజేఐకు వ్యతిరేకంగా గొంతెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగోయ్‌ కూడా ఉండటంతో సీజేఐగా ఆయన నియామకంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నార్సీ, లోక్‌పాల్‌ కేసుల విచారణలో కీలక తీర్పులు వెలువరించారు.

Advertisement
 
Advertisement
Advertisement