రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి.. | Rahul Gandhi Tribute To Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి..

May 21 2019 8:52 AM | Updated on May 21 2019 10:49 AM

Rahul Gandhi Tribute To Rajiv Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్‌ నేతలు ఘన నివాళి అర్పించారు. దిల్లీలోని రాజీవ్‌ సమాధి వీర్ భూమి వద్ద యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్లు సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా గల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో ఆయన వర్థంతిని నిర్వహించారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు వెళ్లిన రాజీవ్ గాంధీ 1991 మే 21 వ తేదిన హత్య గావించాబడ్డ విషయం తెలిసిందే.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని నివాళి
రాజీవ్‌ గాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళి అర్పించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement