మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన నివాళి అర్పించారు. దిల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమి వద్ద యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్లు సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు.