కంగ్రాట్స్ ‘విరుష్క’: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్ ‘విరుష్క’: ప్రధాని మోదీ

Published Wed, Dec 20 2017 9:57 PM

Prime Minister congratulated Virat Kohli and Anushka Sharma - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల వివాహంతో ఒక్కటైన భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మలు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేపు (గురువారం) న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, మరికొందరు సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. ఈ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోహ్లి-అనుష్కలు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తనను కలిసిన విరుష్క జోడీకి మోదీ అభినందనలు తెలిపారు. మోదీని విరుష్క జోడీ కలుసుకున్న సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్‌ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు.


(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Advertisement

తప్పక చదవండి

Advertisement