
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత్ కశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమని కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆహిర్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ అప్పటి భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్, ఆక్రమిత్ కశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారాన్నికనుగొంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.