ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్ప స్థానం సంపాదించుకుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్ప స్థానం సంపాదించుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయన మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని కీలక అంశాలు, నిర్ణయాలు ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. కాగా ప్రధాని ఈ రోజు మధ్యాహ్నం త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ అయిన అనంతరం పరిస్థితులపై మోదీ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.