కొనసాగుతున్న కాల్పులు | Pak violates ceasefire for 3rd consecutive day along LoC | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కాల్పులు

Jun 30 2017 9:50 AM | Updated on Sep 5 2017 2:52 PM

కొనసాగుతున్న కాల్పులు

కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్‌ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్‌ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజూ పాకిస్తాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుందని భారత సైన్యం వెల్లడించింది. అయితే.. పాక్‌కు ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు ఆర్మీ అధికారి తెలిపారు.

రాజౌరీ జిల్లా భీంబర్‌ గలి(బీజీ) సెక్టార్‌లోని భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్స్‌, ఆటోమేటిక్‌ వెపన్స్‌తో పాక్‌ సైన్యం దాడులకు పాల్పడుతుందని తెలిపారు. గురువారం జరిపిన కాల్పల్లో ఇద్దరు భారత జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. జాన్‌లో మొత్తం 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ సైన్యం ఉల్లంఘించిందని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement