బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC Issues Notice To Bengal Government On Ram Navami Clashes - Sakshi

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్ర మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీరామనవమి వేడుకల్లో చోటు చేసుకున్న హింసకు గల కారణాలను తెలుపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. గత వారం శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌‌, అసన్‌సోల్‌ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. హింస చేలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టాల్సిందింగా ఆ రాష్ట్ర డీజీపీని, ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొంది.

మరోవైపు ఈ ఘర్షణలు... తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తున్నాయి. ర్యాలీల పేరుతో రాముడి పేరును చెడగొడుతున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాఖ్యానించిన సంగతి తెలిసిందే.  ఈ వాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందిస్తుంది. తాజాగా షాన్‌వాజ్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బీజేపీ బృందం ఆదివారం హింస తలెత్తిన ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా హుస్సేన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ... పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top