పాట విడుదల చేసిన మోదీ! | Modi releases song hilghting govts victories in two years | Sakshi
Sakshi News home page

పాట విడుదల చేసిన మోదీ!

May 21 2016 11:55 AM | Updated on Mar 29 2019 9:31 PM

పాట విడుదల చేసిన మోదీ! - Sakshi

పాట విడుదల చేసిన మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాటను విడుదల చేశారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ విజయాలపై రాసిన పాటను విడుదల చేశారు. 'నా దేశం మారుతోంది. ముందుకు దూసుకుపోతోంది' అనే పదాలతో ప్రారంభమయ్యే పాటలో ఆద్యంతం బీజేపీ రెండేళ్ల విజయ ప్రస్థానాన్ని ప్రస్తావించారు.

జన్ ధన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా, కేంద్రమంత్రులు ఒక్కొక్కరిగా దూరదర్శన్, మీడియా సంస్థలకు వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్వూలను ఇస్తున్నారు. సమాచారం మంత్రిత్వ శాఖ, పార్లమెంటు సభ్యులు వివిధ శాఖల విజయాలను ప్రజల్లోకి తీసుకుపోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement