ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
పార్వతీపురం(విజయనగరం): ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం అర్థరాత్రి ఒడిశా రాష్ట్రం డోయకల్ రైల్వే స్టేషను వద్దకు చేరుకున్న కొందరు మావోయిస్టులు స్టేషన్ను, అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలింజన్ను బాంబులతో పేల్చివేశారు. ఈ ఘటనలో సుమారు పాతిక మంది నక్సల్స్ పాల్గొన్నట్టు సమాచారం.
ఈ ఘటనలో రైల్వే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా ఆమార్గంలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు.