ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన | Man tied to a train's window, beaten up after altercation over 'drinking water' | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన

Mar 29 2016 10:25 AM | Updated on Oct 8 2018 3:17 PM

ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన - Sakshi

ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన

మధ్యప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇటార్సి: మధ్యప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైలులో ఓ యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఓ యువకుడిని రైలుకు కట్టేసి వేలాడదీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటార్సి రైల్వేస్టేషన్ లో ఈ నెల 25న ఇది జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన వివాదంతో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

తమ బాటిల్ లోని మంచినీళ్లు తాగాడనే కోపంతో యువకుడిపై ముగ్గురు దాడి చేశారు. అతడి పాంట్ ఊడదీశారు. అక్కడితో ఆగకుండా ఊడదీసిన పాంట్ తో అతడి రెండు కాళ్లను రైలు కిటికీ కట్టేశారు. కొంతసేపు అలాగే నిలుచుకున్న బాధితుడు తర్వాత పట్టుతప్పడంతో తలకిందులుగా రైలుకు వేలాడాడు. అక్కడున్నవారంతా అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఈ దారుణోదంతానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement