పట్టాలు తప్పిన లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌ | Lokmanya express derailed in uttarpradesh | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌

May 21 2017 3:41 PM | Updated on Sep 5 2017 11:40 AM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రైలు పట్టాలు తప్పింది.

ఉన్నవ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రైలు పట్టాలు తప్పింది. ఉన్నవ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో లోకమాన్య తిలక్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆదేశించారు. దీనిపై దర్యాప్తునకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement