గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా బావ్ నగర్ ఎమ్మెల్యే జితు వఘనీ ఎన్నికయ్యారు.
అహ్మదాబాద్ : గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా బావ్ నగర్ ఎమ్మెల్యే జితు వఘనీ ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం జితు వఘానీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియకం చేశారు. కాగా వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పట్టు కోసం కమలదళం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆనందీబెన్ను తప్పించి విజయ్ రూపానీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే.