దీదీకి ములాయం, శరద్ యాదవ్ అండ | JD(U), SP support to Trinamool Congress in lok sabha | Sakshi
Sakshi News home page

దీదీకి ములాయం, శరద్ యాదవ్ అండ

Nov 25 2014 1:40 PM | Updated on Sep 2 2017 5:06 PM

దీదీకి ములాయం, శరద్ యాదవ్ అండ

దీదీకి ములాయం, శరద్ యాదవ్ అండ

కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు అండగా నిలిచారు.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు అండగా నిలిచారు. నల్లధనంపై మంగళవారం లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనకు జేడీయూ, సమాజ్‌వాదీ మద్ధతు పలికాయి. మొదట లోక్‌సభలో ఆందోళన చేసిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ వెలుపల కూడా విపక్షాల ఆందోళన కొనసాగించారు. వీరికి జేడీయూ, సమాజ్‌వాదీ ఎంపీలు మద్దతుగా నిలిచారు. కాగా విపక్ష సభ్యుల  నిరసనలతో లోక్ సభ రెండుసార్లు వాయిదా పడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement