ఈ ఏడాది అమర జవాన్లు 64 మంది | Indian Army's 2016 death toll of 64 is highest in six years | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది అమర జవాన్లు 64 మంది

Sep 22 2016 10:17 AM | Updated on Sep 4 2017 2:32 PM

ఉడీ దాడి మృతులను కలుపుకుని ఈ ఏడాది ఇప్పటి వరకు 64 మంది సైనికులు మరణించారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉడీ దాడి మృతులను కలుపుకుని ఈ ఏడాది ఇప్పటి వరకు 64 మంది సైనికులు మరణించారు. ఆరేళ్లలో ఈ సంఖ్యే అత్యధికం. 2010లో 69 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఆసియా తీవ్రవాద పోర్టల్‌(ఎస్‌ఏటీపీ) నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఆశ్చర్యకరంగా నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట పౌర మృతుల సంఖ్య ఈ ఏడాది మూడు దశాబ్దాల్లో కనిష్టంగా నమోదైందని పోర్టల్‌ తెలిపింది. 1990 నుంచి 2007 మధ్య ఏడాదికి సగటున 800  మంది పౌరులు చనిపోయారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement