మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు

Published Thu, Sep 22 2016 7:00 PM

మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాల్ఘర్ జిల్లాలో ఈ ఏడాది  పోషకాహార లోపంతో 600 మంది చిన్నారులు  మరణించిన ఉదంతంలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్నిఆదేశించింది.  పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ స్పందించింది. పాల్ఘర్ లోని మొఖాడా, జవర్, వాడా , విక్రమ్ గఢ్ లలోని నాలుగు తాలూకాలో ఈ మరణాలు సంభవించాయి.


పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది. పోషకాహారలోపంతో మరణాలు సంభవించడం అంటే  పేదవారి  జీవించే హక్కును  కాలరాయడమే అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది.  ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో అమలు చేస్తున్న పథకాల గురించి సమాచారం  ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.


 

Advertisement
Advertisement