పోలీసు కాల్పుల్లో మరో పోలీసు మృతి | head constable dies in police firing | Sakshi
Sakshi News home page

పోలీసు కాల్పుల్లో మరో పోలీసు మృతి

Mar 7 2015 7:40 PM | Updated on Aug 21 2018 7:18 PM

మద్యం మత్తులో ఓ హెడ్‌కానిస్టేబుల్ మరో హెడ్‌కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు.

మద్యం మత్తులో ఓ హెడ్‌కానిస్టేబుల్ మరో హెడ్‌కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట బేస్‌క్యాంప్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మపేట బేస్‌క్యాంప్‌లోని పోలీసులంతా హోలీ వేడుకలు చేసుకుని మద్యం తాగారు.

ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌ఛత్రీ మరో హెడ్‌కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్ (45) మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రమేశ్‌ఛత్రీ.. ప్రసాద్‌పై తుపాకీతో కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడని పోలీస్‌వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement