14న జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ 2 ప్రయోగం

GSLV Mark-3D 2 experiment on 14th - Sakshi

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ఈ ప్రయోగాలకు వేదికకానుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 14న సాయంత్రం జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ2 ద్వారా 3,700 కిలోలు బరువు గల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో కేఏ ఎక్స్‌ కేయూ మల్టీభీమ్‌ అండ్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లను గుర్తించి ఇది సమాచారం అందిస్తుంటుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.  

నెలాఖరులో పీఎస్‌ఎల్వీ సీ43 ప్రయోగం 
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్‌ఎల్వీ సీ43 రాకెట్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్‌ స్పెక్ట్రల్‌ సిస్టం ఇమేజ్‌ శాటిలైట్‌(హైసిస్‌) ఉపగ్రహంతో పాటు 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top