ముండే సంతాపసభలో రివాల్వర్ మిస్‌ఫైర్ | Gopinath Munde's ashes immersed in Godavari | Sakshi
Sakshi News home page

ముండే సంతాపసభలో రివాల్వర్ మిస్‌ఫైర్

Jun 15 2014 10:22 PM | Updated on Sep 2 2017 8:51 AM

బీజేపీ దివంగత నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సంతాపసభలో ఓ రివాల్వర్ మిస్‌ఫైర్‌అయింది. అదృష్టవశాత్తు అం దులోంచి వెలువడిన

 సాక్షి, ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సంతాపసభలో ఓ రివాల్వర్ మిస్‌ఫైర్‌అయింది. అదృష్టవశాత్తు అం దులోంచి వెలువడిన బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే.. అహ్మద్‌నగర్ పట్టణంలోని ఓ సభాగృహంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులు సంతాపసభ ఎర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్నేర్ తాలూకా నుంచి స్థానిక నాయకుడు సంభాజీ రోహోకలే వచ్చారు. నివాళులర్పిం చిన తరువాత తిరిగి బయటకు వెళుతుండగా ఆయన నడుం ఉన్న రివాల్వర్ కిందపడింది. దీంతో అది ఒక్కసారిగా పేలింది. అక్కడున్న పోలీసు వెంటనే రివాల్వర్‌తోసహా అయనను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement