-
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్నగర్లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్లు ఆపరేషన్ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
అహల్యానగర్గా మారిన అహ్మద్నగర్.. కేబినెట్ ఆమోదం
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యానగర్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరు మీదుగా అహ్మద్నగర్ను ‘అహల్యానగర్’గా మార్చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కాగా నిజాంషాహి వంశానికి చెందిన అహ్మద్ నిజాంషా పేరుతో 15వ శతాబ్ధంలో ఈ నగరానికి అహ్మద్నగర్ పేరు పెట్టారు. జిల్లా పేరు మార్చే ప్రతిపాదనను తొలుత సీఎం ఎక్నాథ్ షిండే గతేడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. అహల్యాభాయ్ 298వ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్గా మార్చారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్లకు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ల పేర్లు పెట్టారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్లను ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్గా మార్చడంతో అహ్మద్నగర్ జిల్లా పేరును కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. చదవండి: BJP: అరుణాచల్ అభ్యర్థుల జాబితా విడుదల -
శంషాబాద్లో అమానుషం: స్తంభానికి కట్టేసి.. మెడలో బ్యాటరీలతో సగం గుండు..
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్నగర్ బస్తీలో అమానవీయ సంఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. అహ్మద్నగర్కు చెందిన మహ్మద్ ఖుద్దూస్(20), మహ్మద్ ఖాజా(20) శనివారం ఉదయం మదీనా మజీదుగా గుండా వెళుతున్నారు. ఆటోలోని బ్యాటరీలను తస్కరించి వెళుతున్నట్లు అనుమానించిన అదే బస్తీకి చెందిన అబ్దుల్ రెహ్మన్, మహ్మద్ అలీ, జావేద్, మహ్మద్ గౌస్,మహ్మద్ బారీలు వీరిని అడ్డగించారు. స్థానికంగా ఉన్న స్తంభానికి ఇద్దరి కట్టేసి మెడలో బ్యాటరీలను వేలాడేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరికి సగం గుండు గీయించారు. అనంతరం వారిని చితకబాది అక్కడి నుంచి పారిపోమన్నారు. ఈ తంతంగాన్నంతా వీడియోలు సైతం తీశారు. సంబంధిత వీడియోలు కూడా స్థానికంగా వైరల్ అయ్యాయి. అవమాన భారాన్ని తట్టుకోలేనిసదరు యువకులు సోమవారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి జరిగిన వివరాలను వెల్లడించారు. దీంతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు -
ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక
అహ్మదాబాద్: ఆన్లైన్ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతూ డబ్బులన్నింటినీ తగిలేస్తుండడంతో మరికొందరు వివిధ వెబ్సైట్లు తెరచి అందులో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఆన్లైన్లో పరిచయమైన వారితో రహస్య వీడియోలు పంపుతుండడం.. అవి ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్సైట్లో పోస్టు చేయడంతో వారికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. (చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి) అహ్మదాబాద్కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్లైన్ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది. ప్రత్యేక గదిలో ఆన్లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్సైట్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్సైట్ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలిసీ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్సైట్ వివరాలు తెలుసుకుంటున్నారు. చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు -
కోపార్డి గ్యాంగ్రేప్ కేసులో సంచలన తీర్పు
పుణే : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపార్డి గ్యాంగ్ రేప్ కేసులో అహ్మద్నగర్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా ఖరారు చేసింది. వీరికి శిక్షలను నవంబర్ 22న ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. నిందితులు ముగ్గురు జితేంద్ర షిండే, సంతోష్ జి.భవల్, నితిన్ జి.భాయ్లుమేలు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని న్యాయమూర్తి సువర్ణ కోవలె పేర్కొన్నారు . కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు.. వారు నేరానికి పాల్పడినట్లు నిరూపించాయని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసు పూర్వపరాలు... 2016, జూలై 13న అహ్మద్నగర్ జిల్లా కోపార్డి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక దారుణంగా హత్యాచారానికి గురైంది. తన తాత ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. బాధితురాలు మరాఠ తెగకి చెందిన యువతి కావటం.. నిందితులు దళితులు కావటంతో ఇరువర్గాల పరస్పర ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకిపోయింది. అదే సమయంలో నాసిక్లోని కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులు కూడా జరగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన ప్రభుత్వం, సమన్వయం పాటించాలంటూ ఇరువర్గాలను శాంతింపజేసి.. ఉజ్జల్ నికమ్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. సుమారు 6 నెలలపాటు దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూషన్ దర్యాప్తు ఆధారంగా మొత్తం 350 పేజీల ఛార్జ్షీట్తోపాటు 24 ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకపోవటంతో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలనే పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం(బాధితురాలి రక్తపు మరకలు.. నిందితుల దుస్తులపై ఉన్న మరకలతో సరిపోలటంతో) వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించినట్లు నికమ్ వెల్లడించారు. బాలిక తల్లి స్పందన... కాగా, కోర్టు తీర్పు పట్ల బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్కు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు, పోరాటంలో పాలుపంచుకున్న మరాఠా ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దోషులకు మరణశిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement