భారత్లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తెలిపారు. ఆమె బుధవారమిక్కడ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఈ మూడు నగరాలను గుర్తించేందుకు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెంకయ్య తెలిపారు. హెండ్రిక్స్ కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతితో కూడా భేటీ అయ్యారు. గంగానది ప్రక్షాళనకు రూ. 21 కోట్ల సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని జర్మనీ ప్రభుత్వం పేర్కొన్నట్లు ఓ అధికార ప్రకటన తెలిపింది.