హైదరాబాద్: రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులు అందజేశారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుందని, వంద మాటల సమూహాన్ని ఒక ఫోటో అభివరి్ణస్తుందని కొనియాడారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐజెయు జాతీయ ఉపాధ్యక్షులు నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న సాక్షి ఫొటో గ్రాఫర్లు

ఎ.జాన్ (హైదరాబాద్)

రాజేష్ (హైదరాబాద్)

బాలస్వామి (హైదరాబాద్)

ఆర్.రాజు (ఖమ్మం)
వాసు ప్రసాద్ (వరంగల్)

వేణుగోపాల్ (జనగాం)


