ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌

Five Maoist Died In Encounter At AOB - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: ఆంధ్రా-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో  ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.  ఈ ఘటనలో ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పాడువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిటువాకంటి గ్రామం వద్ద బుధవారం జరిగింది. దీంతో ఏజెన్సీలో గ్రామాలు ఉల్లిక్కిపడ్డాయి. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జరిపినట్లు అధికారులు ధ్రువీకరించారు.  ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌, రెండు ఇన్సాస్‌ ఆయుధాలు, పెద్దమొత్తం వస్తువులులో స్వాధీనం చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top