లోయలో పడిన కారు : ఐదుగురు మృతి | Five killed in Jammu road accident | Sakshi
Sakshi News home page

లోయలో పడిన కారు : ఐదుగురు మృతి

Mar 19 2015 10:08 AM | Updated on Apr 4 2019 5:24 PM

అధిక వేగంతో వెళ్తున్న కారు భారీ లోయలో పడి ఐదుగురు మృతి చెందారు.

జమ్మూ: అధిక వేగంతో వెళ్తున్న కారు భారీ లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా హైవే సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని... వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

కారులో ప్రయాణిస్తున్న వారంతా స్థానికులు కాదని తెలిపారు. కొండ చరియలు విరిగిపడటంతో గత నాలుగు రోజుల జమ్మూ కాశ్మీర్ రహదారి మూసి వేశారు. గురువారం ఉదయమే రహదారిపై ఓ వైపు వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు.

Advertisement
 
Advertisement
Advertisement