తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్‌ | Enforcement Directorate Attaches Assets Worth Rs. 86 Lakh Of Bihar Maoist Leader | Sakshi
Sakshi News home page

తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్‌

Feb 6 2018 4:49 AM | Updated on Oct 9 2018 2:49 PM

Enforcement Directorate Attaches Assets Worth Rs. 86 Lakh Of Bihar Maoist Leader - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌లోఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్‌ యాదవ్‌ అలియాస్‌ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్‌చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్‌ ప్రస్తుతం మావోయిస్టు బిహార్‌–జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ‘మధ్య జోన్‌’ ఇన్‌చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement