రైల్లో 8 బాంబులు స్వాధీనం | Eight live bombs recovered in Bihar | Sakshi
Sakshi News home page

రైల్లో 8 బాంబులు స్వాధీనం

Jun 30 2014 3:23 PM | Updated on Sep 26 2018 3:36 PM

సోమవారం కిషన్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైల్లో నుంచి ఎనిమిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

పాట్నా: బీహార్లో మరోసారి బాంబుల కలకలం చెలరేగింది. సోమవారం  కిషన్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైల్లో నుంచి ఎనిమిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఓ బోగీలో బాంబులు ఉంచినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వివరించారు. ఎవరికో బాంబులను సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. రైలును లక్ష్యంగా చేసుకుని బాంబులు అమర్చారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement