శిశువు మృతిపై కేసు నమోదు
షకూర్ బస్తీ ఘటనపై కేంద్రం, రాహుల్పై ఆప్ సర్కారు ధ్వజం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే ట్రాకుల పక్కన రెండు రోజుల కిందట ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ శిశువు మృతిచెందిన సంఘటన రాజకీయ దుమారం సృష్టిస్తోంది. మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు.. కేంద్రంతోపాటు అటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తింది. ఈ ఘటనకు కేజ్రీవాల్ , మోదీ సర్కార్లదే బాధ్యతని, అవి బాధితులకు పునరావాసం కల్పించకుండా పరస్పర విమర్శలకు దిగుతున్నాయని రాహుల్ ట్వీటర్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు.
కాగా రాహుల్ ఇంకా పిల్లాడిలాగే వ్యవహరిస్తున్నారని, రైల్వేలు కేంద్రం పరిధిలోకి వస్తాయన్న విషయం ఆయనకు తెలియదా? అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. పాప మృతిపై ఆప్ సర్కారు న్యాయవిచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్, రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలిశారు. పునరావాసం కల్పించకుండా ఢిల్లీలో ఇకపై మురికి వాడల తొలగింపు ఉండదని కేజ్రీ మీడియాతో అన్నారు. మరోపక్క.. ఛాతీపై తీవ్రగాయాలు, పక్కటెముకలు విరగడం వంటి కారణాలతో ఆరు నెలల శిశువు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.
బస్తీలో ఆక్రమణల తొలగింపు ప్రారంభించడానికి రెండు గంటల ముందే ఆ శిశువు మృతిచెందినట్టు ప్రభు లోక్సభకు చెప్పారు. అధికారుల చర్యవల్లే తమ పాప మృతిచెందిందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే హడావుడిలో బట్టలమూట పాపపై పడడంతో మృతిచెందినట్లు పాప తండ్రి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కూల్చివేత విషయంలో రైల్వే శాఖపై, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. గూడు కోల్పోయిన 5 వేల మందికి వెంటనే పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించింది.
ఢిల్లీ కూల్చివేతలకు రాజకీయరంగు
Published Tue, Dec 15 2015 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement