బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ | BJP parliamentary board meeting started | Sakshi
Sakshi News home page

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ

Oct 19 2014 6:38 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది.

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలను చర్చించనున్నారు.


ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను పార్టీ నేతలు అభినందించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ లేదా శివసేన సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. శివసేన అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement