‘నిందితులను కాపాడే చర్య!’ | 'Action to protect the guilty!' | Sakshi
Sakshi News home page

‘నిందితులను కాపాడే చర్య!’

Oct 14 2014 12:23 AM | Updated on Sep 2 2017 2:47 PM

బొగ్గు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును ముగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, ...

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కవుల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును వుుగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, మూసివేత నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి గుప్తాతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్  సంస్థతో పాటు ఆ సంస్థ ఉద్యోగులు, పలువురు బొగ్గు శాఖ అధికారులపై పెట్టిన కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయించి కోర్టుకు నివేదిక అందజేసింది.

దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి భరత్ పరాశర్.. కేసు మూసివేత సరికాదంటూ నివేదికను తిరస్కరించారు. ఈ కేసులో నిందితులను కాపాడే తరహాలో సీబీఐ చర్యలు ఉన్నాయన్నారు.  సరైన మానవ వనరులు లేని కారణంగా బొగ్గు శాఖ అధికారులు కమల్  దరఖాస్తుపై స్క్రూటినీ నిర్వహించలేకపోయారనడం సరికాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement