మోదీ 'ఆప్'లేకపోయారు.. | aap victory | Sakshi
Sakshi News home page

మోదీ 'ఆప్'లేకపోయారు..

Feb 10 2015 1:53 PM | Updated on Mar 29 2019 9:31 PM

మోదీ 'ఆప్'లేకపోయారు.. - Sakshi

మోదీ 'ఆప్'లేకపోయారు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం 'ఆప్' వైపే వచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించినా అరవింద్ కేజ్రీవాల్ను 'ఆప్'లేకపోయారు. ద్విముఖ పోరు అనుకున్నారు కానీ ఏకపక్షంగా సాగిందనే చెప్పాలి.

లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి తొలి ఎదురుదెబ్బ. సాధారణ ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ్యంగా మోదీ జైత్రయాత్ర నిన్నటిదాకా కొనసాగింది. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో బీజేపీ అఖండ విజయం సాధించగా, కశ్మీర్‌లో పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా మంత్రం పనిచేసింది. అయితే ఢిల్లీలో ఇది వికటించింది. అంతేగాక బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement