మృతదేహంతో 5 కి.మీ. నడక | 5km walking with dead body | Sakshi
Sakshi News home page

మృతదేహంతో 5 కి.మీ. నడక

Jul 6 2017 2:43 AM | Updated on Apr 3 2019 5:32 PM

మృతదేహంతో 5 కి.మీ. నడక - Sakshi

మృతదేహంతో 5 కి.మీ. నడక

మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు డబ్బులు లేక కాలినడకన మోసుకుంటూ వెళ్లిన మరో ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

బరంపురం: మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు డబ్బులు లేక కాలినడకన మోసుకుంటూ వెళ్లిన మరో ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. సురడా నియోజకర్గ పరిధి సోరిస్‌బిలి గ్రామానికి చెందిన భానుమతి నాయక్‌(70) కొద్దిరోజుల క్రితం అనార్యోగం బారినపడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది.

మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి 108 వాహనం లభించలేదు. ప్రైవేటు వాహనంలో తరలించేందుకు భానుమతి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేవు. దీంతో మృతదేహానికి దుప్పటి చుట్టి కర్ర సహాయంతో డోలీలా తయారు చేసి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం ఒడిశాలోనే కలహండి జిల్లాలో ధనమజ్జి అనే వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజాన పెట్టుకుని 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి నడుచుకుంటూ వెళ్లిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజా ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement