బీహార్లో పిడుగులు పడి 21 మంది మృతి | Sakshi
Sakshi News home page

బీహార్లో పిడుగులు పడి 21 మంది మృతి

Published Sun, Oct 6 2013 2:13 PM

21 killed by lightning across Bihar

బీహార్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన సంఘటనలో మొత్తం 21 మంది మరణించారు. ఔరంగాబాద్ జిల్లాలో ఆరుగురు, బంకాలో ఐదుగురు, జముయ్లో ముగ్గురు, సుపాల్లో ఇద్దరు, భోజ్పూర్, కటిహార్, పాట్నా, గయా, రోహ్టాస్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఈ దుర్ఘటనలు జరిగాయి. ఔరంగాబాద్లో నలుగురు పిల్లలు మైదానంలో ఆడుకుంటున్న సమయంలో పిడుగుపడటంతో మరణించారు.

Advertisement
Advertisement