-
సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!
మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే కూరగాయాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇవే గుర్తోస్తాయి. కానీ వీటితోపాటు ఆరోగ్యానికి మంచివి, కొన్ని వ్యాధుల తీవ్రం కాకుండా నిరోధించే మంచి ఔషధగుణాలు కలిగినవి కూడా ఉన్నాయి. వాటిలో ఈ సబ్జగింజలు ఒకటి. వీటిని బేసిల్ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి, కాదు ముఖ సౌందర్యాన్ని ఇమనుడింప చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జా గింజలు ఆరోగ్య పరంగానూ, ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!. ఆరోగ్యపరంగా.. మధుమేహన్ని నియంత్రిస్తాయి. ప్రతీరోజు రెండు స్పూన్ల సబ్జాగింజలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినాలన్న కోరికను నియంత్రిస్తుంది భోజనానికి ముందు సబ్జా గింజలను పెరుగులో కలిపి, కొన్ని కూరగాయ ముక్కలను జోడించి తీసుకుంటే మనకు తెలియకుండానే తక్కువగా ఆహారం తీసుకుంటాం. నానాబెట్టిన సబ్జాగింజలను నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఏదోరకంగా సబ్జాగింజలను తీసుకుంటుంటే కడుపు మంటను నియంత్రించడమే గాక శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మారకుండా నియంత్రిస్తుంది సబ్జాతో మరింత కాంతిమంతం సబ్జాగింజలను నీటిలో నానబెట్టి , పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా రాయాలి. పదినిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖం కాంతిమంతంగా, ఫ్రెష్గా కనిపిస్తుంది. పంటికి జామ నాలుగు జామ ఆకులని నీటిలో వేసి మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి..గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల రసం పళ్లను మరింత దృఢంగా మారుస్తుంది. (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్ఫుల్ అంటున్న వైద్యులు!) -
పిడుగుపాటుకు ఒకే రోజు 9 మంది మృతి!
భోపాల్: పిడుగులు పడి మధ్యప్రదేశ్లో ఒకే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో పిడుగులు పడి ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సైతం భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. చెట్టుకింద నిలుచోవటమే శాపంగా మారింది.. విదిశా జిల్లాలోని అగసోడ్ గ్రామంలో శనివారం సాయంత్రం వర్షం వస్తుందని నలుగురు ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. అయితే.. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లు సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కున్వర్ సింగ్ ముకటి తెలిపారు. మృతులు గాలు మాలవియా, రాము, గుడ్డా, ప్రభు లాల్గా గుర్తించారు. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు. సట్నా జిల్లాలోని పోడి పతౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అంజన, చంద్రా, రాజ్కుమార్, రామ్కుమార్ యాదవ్గా గుర్తించారు. గుణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదీ చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
యూపీలో పిడుగుల వర్షం.. ఒకే రోజు 14 మంది మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్లో ఇద్దరు, బలరామ్పుర్, చందౌలీ, బలుందర్శహర్, రాయ్బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
పిడుగును ఫోన్లో బంధించబోయి..
చెన్నై : మొబైల్లో పిడుగు ఫొటోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో బుధవారం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో స్నేహితుడి రొయ్యల ఫాంకు వెళ్లిన రమేష్(43) పిడుగుపాటును ఫోన్లో చిత్రీకరించేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పిడుగు అతనికి మరింత చేరువలో పడటంతో ఆ ధాటికి రమేష్ ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. ఫాం వద్ద పడివున్న రమేష్ను అతని స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. రమేష్ ముఖం, ఛాతి భాగాల్లో తీవ్రంగా గాయాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని వివరించారు. కాగా, పిడుగుపాటు సమయంలో ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు యత్నించొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఎర్రబాలెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి సుబ్బారెడ్డి(65), మోది గురవయ్య(65), మోది లక్ష్మి(60)లు వంగతోటలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement